పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య

55319చూసినవారు
పురుగుల మందు తాగి జంట ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలో శనివారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. మార్కాపురం మండలం చింతకుంట సమీపంలో జంట ఆత్మహత్య చేసుకుంది. పుచ్చకాయలపల్లికి చెందిన సత్యనారాయణ రెడ్డి, విజయమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపడుతున్నారు. వివాహేతర సంబంధమే ఆత్మహత్యకు కారణమని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.