AP: ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్తో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆరోగ్య శ్రీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి. మరో రూ.300 కోట్ల నిధుల విడుదలకు సీఎస్ జవహర్ రెడ్డి హామీ ఇచ్చినట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది. ఆరోగ్య శ్రీ పథకం కింద సేవలు అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉండగా.. తాజాగా రూ.203 కోట్లు విడుదల చేసింది.