కూటమితోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కొవ్వూరు నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం తాళ్లపూడి మండలం తాడిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం ముప్పిడి మాట్లాడుతూ ప్రజలందరూ కూటమికి మద్దతు తెలపాలని అన్నారు.