కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. ‘మీకు ప్రజల పట్ల ఉన్న నిబద్ధత, ప్రజా శ్రేయస్సు కోసం పడే తపన ఒక కుటుంబ సభ్యుడిగా చాలా దగ్గర నుంచి చూశాను. మీరు చేపట్టిన ఈ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించగలరని బలంగా నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు.