రాజమండ్రిలోని మోరంపూడి జంక్షన్ పైవంతెన మరో రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఇక్కడి ట్రాఫిక్ సమస్యకు, రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారం మార్గం లభించనుంది. బీటీరోడ్డు, రివైడర్ పనులు, విద్యుత్తు దీపాల పనులు చేపట్టాల్సి ఉంది. వాతావరణం అనుకూలిస్తే మరో రెండు నెలల్లో పూర్తవుతాయని, లేకుంటే మూడునెలలు పడుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు సోమవారం తెలిపారు.