ఫిబ్రవరి 16 దేశవ్యాప్త గ్రామీణ బంద్ జయప్రదం చేయాలని కోరుతూ రైతు సంఘాలు కార్మిక సంఘాలు కాకినాడ భానుగుడి నుంచి శనివారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా. రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు తిరుమలశెట్టి నాగేశ్వరరావు, అప్పారెడ్డి మాట్లాడారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర చట్టాన్ని చేయాలని, కార్మికులందరికీ కనీస వేతనం 26, 000 చెల్లించాలని డిమాండ్ చేశారు.