నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు

52చూసినవారు
నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు
పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్షకు సంబంధించి దరఖాస్తులు స్వీకరణ గడువును సెప్టెంబర్ 23 వరకు పొడిగించినట్లు నవోదయ ఇంచార్జి ప్రిన్సిపల్ రామకృష్ణయ్య తెలిపారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5 తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ప్రవేశ పరీక్ష 2025 జనవరి 18న జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్