జగన్ నియంత పాలనపై ప్రజల్లో తీవ్ర సంతృప్తి కనిపిస్తోందని సిటీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి తనయుడు దగ్గుబాటి హితేశ్ చెంచురామ్ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలోని 36వ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ మ్యానిఫెస్టో, రాజమండ్రి అభివృద్ధి కోసం విడుదల చేసిన మ్యానిఫెస్టోను ప్రజలకు అందచేశారు.