375 తీవ్రసమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మాధవీలత ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తూ. గో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1577 పోలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు సన్నద్ధం చేశామన్నారు. 375 తీవ్ర సమస్యాత్మక, 164 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి తగిన బందోబస్తు ఏర్పాటుచేశామని వివరించారు.