వశిష్ట గోదావరి వరద కాస్త తగ్గుముఖం

63చూసినవారు
వశిష్ట గోదావరి వరద కాస్త తగ్గుముఖం
పశ్చిమగోదావరి జిల్లా, ఆచంట నియోజకవర్గంలో వశిష్ట గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో లంక గ్రామాలు ముంపు నుండి బయటపడుతున్నాయి. అలాగే గోదావరి తీరాన ఉన్న ప్రధాన ఘాట్లు వరద ఉధృతకి గతంలో నీటమునకగా అవి బయటపడ్డాయి. అయితే అనుకున్నంత స్థాయిలో వరద తగ్గకపోవడంతో ప్రజలు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ప్రమాదం లేకపోవడంతో లంక గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్