భీమవరం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ నిరసన

66చూసినవారు
భీమవరం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్మిక చట్టాలననుసరించి ఈఎస్ఐ, పీఎఫ్ వర్తించేలా చేయాలని కోరారు. అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జేఎన్వీ గోపాలం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్