చింతలపూడి ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ కుటుంబరావు నాగాలాండ్ రిజర్వ్ పోలీస్ బలగాలతో శుక్రవారం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. అలాగే రాజకీయ పార్టీ ప్రచార కార్యక్రమంలో 18 సంవత్సరాల లోపు పిల్లలను ఉపయోగించరాదని, ప్రచార కార్యక్రమంలో ఇతర పార్టీల పట్ల అసత్యాల ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు.