మేకను బలిచ్చి మొక్కు తీర్చుకున్న జనసైనికులు

72చూసినవారు
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా లింగపాలెం మండలం ఆశన్నగూడెం గ్రామంలో జనసేన పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల ప్రధాన కార్యదర్శి మోదుగు అంజిబాబు ఆధ్వర్యంలో జనసేన స్తూపం వద్ద మేకను బలిచ్చి మొక్కుబడి తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్