న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఆదివారం నిర్వహించిన లాసెట్-2024 ప్రశాంతంగా ముగిసింది. ఏలూరు జిల్లాలోని 2 కేంద్రాల్లో పరీక్ష జరగ్గా. 270 మంది హాజరయ్యారు. ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కేంద్రంలో 143కి 114 మంది హాజరయ్యారు. సిద్దార్థ క్వెస్ట్ సీబీఎస్ఈ పాఠశాల కేంద్రంలో 186కి 156 మంది పరీక్ష రాశారు. రెండు కేంద్రాల్లో కలిసి 59 మంది గైర్హాజరయ్యారు.