ఉంగుటూరు: చిరుత పులి కోసం బోన్లు ఏర్పాట్లు!

78చూసినవారు
ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం ఎం.నాగులపల్లి ఏరియా పరిధిలో ఉన్న ఆండాలమ్మ చెరువు ప్రక్కన ఉన్న పాడుబడిన పాత ఇటుకలు బట్టి ఆసరా చేసుకుని చిరుత పులి ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు కనుగొన్నారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులు స్పందించి సుమారు పది ట్రాప్ కెమెరాలు, పులిబోనులు అమర్చి పులి కోసం అన్వేషిస్తున్నట్లు ఏలూరు డివిజన్ ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్వీఎస్ కుమార్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్