AP: కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించారు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూల్కు మార్చారు. లక్షలు కట్టి పిల్లల్ని చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పిల్లలు పోటీ పడగలరా? అనే భావనలో చంద్రశేఖర్ పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.