ఏపీలో షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయ్యాక సీఎం జగన్లో భయం మొదలైందని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వైనాట్ 175 నుంచి ప్రజలు ఓడిస్తే ఇంట్లో కూర్చుంటామని సీఎం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మోసపూరిత వైసీపీని ఓడించి రాజశేఖర్రెడ్డి పాలన తెచ్చుకోవాలంటే కాంగ్రెస్కు ఓటేయాలని ఆర్కే పిలుపునిచ్చారు.