ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందుతున్నాయి. ఇకపై వాటితో పాటు పుస్తకాలు, బ్యాగులనూ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ స్కూళ్లు, హైస్కూల్ ప్లస్లలో చదివే విద్యార్థులకు తెలుగు అకాడమీ ద్వారా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్ష డైరెక్టర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.