ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను కూటమి నేతలు కలిశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందజేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూటమి నేతల్ని గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆహ్వానించారు. రేపు ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.