గుంటూరులో 14 ఎస్ఈడి స్క్రీన్ ఏర్పాటు: కమిషనర్

71చూసినవారు
గుంటూరులో 14 ఎస్ఈడి స్క్రీన్ ఏర్పాటు: కమిషనర్
ఈనెల 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించటానికి గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎస్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, మాయాబజార్ సెంటర్, డొంక రోడ్, నాజ్ సెంటర్, ఏటుకూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి అమ్మ గుడి వద్ద తదితర ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్