ఈనెల 5వ తేదీన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొన్నూరు ఎన్నికల పర్యటనలో భాగంగా జిబిసి రోడ్డు సజ్జ కళ్యాణ మండపం ఎదురు హెలిప్యాడ్ స్థలాన్ని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆ పార్టీ నాయకులు గత శుక్రవారం పరిశీలించి ఏర్పాటు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హెలిప్యాడ్ స్థలాన్ని ప్రోక్లైన్లతో గుంతల మయం చేశారు. దీంతో కూటమి అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.