గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 22, 442 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ-నామ్ విధానం ద్వారా 14, 739 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్-5, 273, 341, 4884, సూపర్-10 రకాల మిర్చి సగటు ధర రూ. 7, 500 నుంచి రూ. 18, 000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవ నూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర 8, 000 నుంచి 19, 500 వరకు లభించింది.