రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్నతోనే తన ప్రయాణం ఉంటుందని మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. బుధవారం గుంటూరులో ఆమె మాట్లాడుతూ తను పార్టీ మారుతున్నట్లు కొందరు పనికట్టుకొని మరి ప్రచారం చేస్తున్నారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజలను మభ్య పెట్టాలని తనను, తన భర్త దయాసాగర్ కు లేనిపోని అవాస్తవాలు అంటగడుతున్నారని చెప్పారు.