ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే మాధవి

51చూసినవారు
ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలి: ఎమ్మెల్యే మాధవి
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో శనివారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ సమేతంగా వినాయక చవితి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ప్రజలు పాడిపంటలు, ఆరోగ్యం, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ ఏడాది అనుకోకుండా వచ్చిన వరదలు, భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వారిని అందరూ ఆదుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్