చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం

50చూసినవారు
చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం
చేనేత కార్మికులందరికీ నేతన్న నేస్తం ఇవ్వాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. శుక్రవారం మంగళగిరి చేనేత కార్మిక సంఘం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చేనేత కార్మికులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలన్నారు. కార్మికులందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు వెంటనే అమలు పరచాలన్నారు. దీనిపై విధి విధానాలు రూపొందించి అమలు చేసే విధంగా జీవో ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్