గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన జిల్లా వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యుడు బోద్దులూరి రంగారావు సోమవారం తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామ చేశారు. మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య తనకు పదవిని ఇచ్చారని, ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంగా స్వచ్ఛందంగా రాజీనామ చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామ పత్రాన్ని జిల్లా అధికారులకు పంపనున్నట్లు పేర్కొన్నారు.