టీడీపీ సీటు పులి చిన్నాకు కేటాయించాలి
తాడికొండ నియోజకవర్గ టీడీపీ సీటు పులి చిన్నాకు కేటాయించాలని మాదిగ మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు బోయలపల్లి ప్రభాకర్ మాదిగ అన్నారు. సోమవారం తుళ్ళూరులోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ. గత 40 సంవత్సరాలుగా తాడికొండ టీడీపీ సీటు మాలలకి ఇస్తున్నారని, రానున్న ఎన్నికల్లో టీడీపీ తరపున మాదిగ సామాజిక వర్గానికి చెందిన పులి చిన్నాకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.