ఏపీలో గత రెండు రోజులగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. తుఫాన్ ప్రభావంతో విజయవాడ రూరల్ మండలంలోని అంబాపురం, నైనవరం, పాతపాడు గ్రామాలు పూర్తిగా నీటి మునిగాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.