నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయని, శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలుల, పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ ప్రభావంతో మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఉమ్మడి గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది.