AP: ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మద్యం విక్రయాలకు సంబంధించిన లెక్కలను ఏపీ ఎక్సైజ్ శాఖ తాజాగా ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా రూ.6,312 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలిపింది. 75 రోజుల్లో 26.79 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయాయని వెల్లడించింది. 83.75 లక్షల కేసుల మద్యం విక్రయించినట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది.