చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతోన్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయాని సీఎం జగన్ అన్నారు. "ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ప్రజలకు, బాబు మోసాలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్కు ఓటేస్తే.. ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి. బాబుకు ఓటేస్తే ఇప్పుడున్న పథకాలన్నీ ఆగిపోతాయి." అని పిడుగురాళ్ల 'మేమంతా సిద్ధం' సభలో సీఎం పేర్కొన్నారు.