ఇండియాలో అత్యధిక బడ్జెట్తో రూపొందనున్న చిత్రాల్లో రణ్బీర్ కపూర్ నటించనున్న ‘రామాయణం’ ఒకటి. ఈ మూవీపై తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది. మూడు భాగాలుగా వస్తున్న ఈ సినిమాలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయిపల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్, కుంభకర్ణుడిగా బాబీ డియోల్, కైకేయిగా లారా దత్తాలను తీసుకోవాలని డైరెక్టర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విభీషణుడిగా విజయ్ సేతుపతిని తీసుకుంటున్నట్లు సమాచారం.