పోరుమామిళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య

59చూసినవారు
కడప జిల్లా పోరుమామిళ్లలోని రామ్ నగర్ చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శంకవరం రమేష్ పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో పాటు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇతనికి వివాహమై రెండు సంవత్సరాలు కాగా గత కొంత కాలంగా భార్యతో విభేదించి ఒంటరిగా జీవిస్తున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్