మైదుకూరు ఐల ఎంటర్ఫైనర్స్ -ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని పారిశ్రామిక వేత్తలు సోమవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయనను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మైదుకూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అభివృద్ధికి కృషి చేయాలని ఆయనను కోరారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు ఐల పారిశ్రామిక వేత్తలు పల్లెటి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.