మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని సోమవారం దువ్వూరు మండలానికి చెందిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ మాజీ సలహాదారులు తిరుపాల్ రెడ్డి కుటుంబసభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల పరిస్థితులను, జిల్లా రాజకీయ పరిస్థితులను గురించి చర్చించారు. వైసీపీ పార్టీ పటిష్టతకు మునుముందు గట్టి కృషి చేయగలమని, పార్టీకి, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలపారు.