పెనగలూరు సభ భవనంలో జరిగిన మండలి సర్వసభ్య సమావేశంలో గురువారము పాల్గొని అధికారులకు దిశా నిర్దేశం చేసిన రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. శ్రీధర్ మాట్లాడుతూ, రైల్వే కోడూరు ఇంచార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యలకు ప్రాధ్యాన్యం ఇస్తూ త్వరిత గతిన పరిష్కరించనున్నామని అన్నారు. ప్రజలకు ప్రభుత్వనికి ఉద్యోగులు వారధులని, సమస్యలను ఎప్పటికప్పుడు నమోదు చేసి ఉన్నత అధికారులకు నివేధించాలని అన్నారు.