పి. గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో గురువారం నిర్వహించిన ప్రజాగళం సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి టీడీపీ అధినేత నార చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు లాంఛనమే కూటమే గెలుస్తుందని అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని స్పష్టం చేశారు. ఈ సభకు టీడీపీ, జనసేన, బిజెపి నుండి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.