అసమానతలు తొలగాలంటే చదువు ఒకటే పరిష్కారమని ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి భావించి అందుకు అనుగుణంగా పరిపాలన అందిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. శనివారం చల్లపల్లి విజయ క్రాంతి జూనియర్ కాలేజీలో ఫేర్వెల్ డే వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థుల ఆనందోత్సవాలు నడుమ ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని అన్నారు.