కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంగళవారం బుట్టాయిపేట సెంటర్ నందు లారి ఢీకొని 35 సంవత్సరాల మహిళ మృతి చెందడం జరిగింది. సోమవారం రాత్రి తపసిపూడి గ్రామంలో వివాహానికి హాజరై స్వగ్రామమైన చల్లపల్లి దంపతులు బయలుదేరారు. మృత్యువు లారీ రూపంలో వచ్చి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.