బంటుమిల్లిలో ముగ్గురు దొంగలు అరెస్ట్

75చూసినవారు
కృష్ణా జిల్లాలో నీటి మోటార్లను చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ మాట్లాడుతూ..బంటుమిల్లికి చెందిన వెంకటనారాయణ, నాగేంద్రకుమార్, జమీల్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో రైతులకు చెందిన నీటి మోటార్లు చోరీ చేస్తున్నారన్నారు. ఎట్టకేలకు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఐదు లక్షల రూపాయలు విలువ గల నీటి మోటర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్