కైకలూరు: స్లాబ్ పెచ్చులు ఊడి విద్యార్థినికి గాయాలు

70చూసినవారు
కైకలూరు మండలం చింతపాడు హైస్కూల్ వద్ద 7వ తరగతి చదువుతున్న జయశ్రీ అనే విద్యార్థిపై శుక్రవారం తరగతి గదిలో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో విద్యార్థినికి తీవ్రగాయాలయ్యాయి. పాఠశాల సిబ్బంది ఆ విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. బిల్డింగు అధ్వానమైన స్థితికి వచ్చినప్పటికీ విద్యార్థులను ఆ గదిలోనే కూర్చోబెట్టడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్