నియోజకవర్గ కేంద్రమైన కైకలూరు లో నారా రోహిత్ సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎన్డీయే ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ తెలిపారు. తాలూకా సెంటర్ నుంచి ప్రచారం ప్రారంభమయి ఏలూరు రోడ్డు లోని సిఎన్నార్ గార్డెన్స్ లో మీటింగ్ ఉంటుందని పార్టీ వర్గాలు అదివారం ఒక ప్రకటనలో తెలిపాయి. కార్యక్రమంలో
టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొవాలని కోరారు.