కంకిపాడులో ఓటు వేసిన శ్రీ రెడ్డి
కృష్ణాజిల్లా కంకిపాడులో స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్నికల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం సినీ నటి శ్రీరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు వేసి వెళ్లారు. పంచాయతీ బూత్ లో ఓటింగ్ కార్యక్రమం సజావుగా కొనసాగుతోంది. ఓటు వేసేందుకు ప్రజలు ఉదయం నుంచే బారులు తీరారు.