నూజివీడు నియోజకవర్గ పరిధిలో గల చాట్రాయి మండలం సోమవారం పెద్ద చెరువులో సోమవార గ్రామానికి చెందిన పెద్ద లంక వరలక్ష్మికి చెందిన 4 గేదెలు పిడుగుపాటుకు గురయి గేదెలు మృతి చెందాయి. దీంతో బాధిత రైతు ఈ సంఘటనపై కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత రైతు కోరారు. చెట్టు కింద గేదెలను కట్టి వేసి ఉన్నాయి. పిడుగు ఒక్కసారిగా పట్టడంతో గేదెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు చెప్పారు.