నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోండి

63చూసినవారు
నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోండి
బంటుమిల్లిలో నకిలీ విలేఖర్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం ఏపీయుడబ్ల్యుజే జర్నలిస్టులు పోలీసులను కోరారు. ఈ మేరకు ఎస్ఐని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇటీవలి కాలంలో కొంత మంది జర్నలిస్టులమని చెప్పుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, జాతీయ రహదారిపై బియ్యం లారీలను ఆపి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. వీటిపై విచారణ జరిపి నకిలీ విలేఖర్లపై చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్