హాలహర్వి మండలంలోని చింతకుంట, మెదాహల్ వద్ద వంతెన నిర్మాణం ఆసంపూర్తిగా ఉండటంతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని సోమవారం స్థానికులు తెలిపారు. హగరి నుంచి జడ్చర్ల వరకు నేషనల్ హైవే నెం 167ను రూపొందించారు. పనులను నాలుగు ప్యాకేజీలుగా విభవించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఎస్ఆర్కే కన్స్ట్రక్షన్స్ కంపెనీ దక్కించుకుంది. 70 శాతం పనులు పూర్తయ్యాయి అయితే కాంట్రాక్టర్లు మధ్యలోనే చేతులెత్తేశారు.