ఇండియా కూటమిలో భాగంగా రాష్ట్రంలో సీపీఎం పోటీ చేసే 10 ఎమ్మెల్యే, ఒక లోక్ సభ స్థానాల్లో అభ్యర్థులను ఆపార్టీ అధిష్ఠానం మంగళవారం ప్రకటించింది. ఇందులో భాగంగా కర్నూలు అభ్యర్థిగా డి. గౌస్ దేశాయ్ కి టికెట్ కేటాయించింది. మరోవైపు వైసీపీ నుంచి ఇంతియాజ్ బరిలో ఉండగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా టీజీ భరత్ పోటీ చేస్తున్నారు.