అప్పుల బాధతో రైలు కింద పడి రైతు ఆత్మహత్య

71చూసినవారు
అప్పుల బాధతో రైలు కింద పడి రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో తుగ్గలి మండలం జొన్నగిరి గుంత అనుమన్న (59) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నారు. సోమవారం గుత్తి రైల్వే పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గుంత అనుమన్న ఉన్న 4. 5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సాగు గిట్టుబాటు కాక, కుటుంబ పోషణ, పిల్లల పెళ్లిళ్లు చేసి అప్పులపాలయ్యారు. రూ. లక్షల్లో ఉన్న అప్పులు తీర్చే మార్గంలేక మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్