పత్తికొండ పట్టణంలో గల ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో పోషణ మాసోత్సవాలను పురస్కరించుకొని గురువారం కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబు ఆర్డీవో రామలక్ష్మి పాల్గొని పౌష్టికాహార ప్రాముఖ్యతను, గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు. గర్భిణీ మహిళలకు పసుపు కుంకుమ గాజులు జాకెట్లతో సత్కరించారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.