స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి

50చూసినవారు
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం విరమించుకోవాలి
వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటును విరమించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం అస్పరి సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రస్తుత సీఎం చంద్రబాబు వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన వెంటనే వాటి ఏర్పాటును కొనసాగించేందుకు పూనుకోవడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో విరుపాక్షి, కృష్ణమూర్తి, అంజినయ్య, ఉరుకుందప్ప పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్